Posts

Showing posts from November, 2021

కయీను పశ్చాతాపం..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - కయీను పశ్చాతాపం.. 🔸సృష్టిలో జన్మించిన మొట్టమొదటి మానవుడు  🔸వ్యవసాయకుడు  🔸మొట్ట మొదటి నరహంతకుడు  🔸సహోదరుని ప్రేమించలేని వాడు  🔸కోపం, ద్వేషం కలిగినవాడు  🔸సత్క్రియలు లేనివాడు  🔸దేవునికి అంగీకారయోగ్యమైన అర్పణ అర్పించలేనివాడు.  🔸దేవునిమీద ఎదురు తిరిగినవాడు  🔸రక్తం ప్రార్ధించడానికి కారకుడు  🔸నేల తన సారాన్ని కోల్పోవడానికి కారకుడు. 🔸దేవునిచే శపించబడినవాడు  🔸దేశ దిమ్మరి  సృష్టిలో అత్యున్నతమైన సృష్టముగా దేవుడు మనిషిని సృష్టించారు. తలిదండ్రుల జన్మనివ్వడం ద్వారా భూమిమీదకు ఏతెంచనున్న మొట్టమొదటి మనిషిగా కయీనును దేవుడు నిర్ణయించారు. అంటే, కయీనుపట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళికవుందనే విషయం సుస్పష్టం. అయితే దేవుడు అతనిపట్ల కలిగియున్న ప్రణాళిక నెరవేరకుండా, తనకివ్వబడిన స్వేచ్ఛను కయీను వాడుకొని, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాడు. తాను అర్పించిన అర్పణ ద్వారా దేవునిని సంతోషపరచలేక పోవడమే కాకుండా, తన  సహోదరుడైన హేబెలును చంపి, తన పాపమును ఒప్పుకొనక, కప్పుకొని, తనను సృష్టించిన దేవునిమీదే తిరు...

చచ్చిపోవాలని అనుకోవద్దు..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - సమస్య వస్తే పోరాడాలి కాని..చచ్చిపోవాలని అనుకోవద్దు.. తాను ఒక దినప్రయాణము  అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణా పేక్షగలవాడై యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను. 1రాజులు 19 : 4 🔹ప్రార్ధించిన వ్యక్తి: ఏలియా 🔹దేనికొరకు : తన ప్రాణమును తీసుకొమ్మని  🔹సందర్భము: యెజెబెలు తనను చంపజూచినప్పుడు  కర్మెలు పర్వతం మీద 850మంది బయలు, అషారాదేవి ప్రవక్తలమీద సవాలు విసిరి, ఆకాశమునుండి అగ్నినిదింపి, నిజదేవుడెవరో నిరూపించి, ఆ ప్రవక్తలందరిని కీషోను వాగుదగ్గర వధించి, సర్వోన్నతుని శక్తిని లోకానికి చాటిన వ్యక్తి, నేటి దినాన్న, యెజెబెలుకు భయపడి, తన ప్రాణాన్ని తీసుకోమని దేవుని ప్రార్ధించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.  పౌరుషం కలిగిన ప్రవక్త హృదయమంతా, నిరాశతో నిండిపోయిందా? తద్వారా, ఆయన మానసికంగా కృంగిపోయారా? అయితే, గొప్ప విజయం తర్వాత, ఇట్లాంటివి జరగవచ్చు కూడా. కొన్ని పరిస్థితులు ఎట్లాంటివారికైనా భయాన్ని కలిగించవచ్చు. ఆయనేమి మానవాతీతుడు కాదు. ఆయన కూడా మనవంటి స్వభావ...

- కుటుంబ ప్రార్ధన..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR  - కుటుంబ ప్రార్ధన.. మన ఇంటి చుట్టూ కాంపౌండ్ ఎందుకు వేసుకుంటాము? ఒక కంచెలాగా, భద్రత కొరకే కదా? ఇంటికి భద్రత వున్నది. మరి ఇంటిలో ఉన్న మనుషులకు భద్రత ఎట్లా? అది కుటుంబ ప్రార్ధన ద్వారానే సాధ్యం. మన కుటుంబాలలో, దేవునితో సాన్నిహిత్యం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచగలిగేది ఏదైనా ఉందంటే, అది “కుటుంబ ప్రార్ధనే” క్రైస్తవ కుటుంబములో, కుటుంబ ప్రార్ధన అత్యంత ప్రాధాన్యమైనది. లేకుంటే, పైకప్పు లేకుండా, నాలుగు గోడల మధ్య నివాసం చేసే గృహము ఏ రీతిగా భద్రతలేకుండా ఉంటుందో, అదేరీతిగా కుటుంబ ప్రార్థనలేని గృహాలు, వారి ఆధ్యాత్మిక జీవితాలు అదే రీతిగా ఉంటాయి. కుటుంబ జీవితంలో అనేక సందర్భాలలో కొన్ని మనస్పర్థలు రావడం సహజమే. అయితే, కుటుంబ ప్రార్ధన కలిగిన కుటుంబాలలో ఇవి కొనసాగలేవు. కలసి  ప్రార్థిస్తే ద్వేషము, కోపము, అనుమానాలు తొలిగిపోయి వాటి స్థానంలో ప్రేమ వచ్చి చేరుతుంది. కలిసి ప్రార్థించకపోతే కలసి ప్రేమగా జీవించలేరు.  ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు  నా నామమున కూడియుందురో  అక్కడ వారి  మధ్యలో నేను వుంటాను అని యేసయ్య చెప్పారు కదా? (మత్తయి ‪18 :20‬ ) మరి ఈ...

- జ్ఞానులవలే నడుచుకొనుడి...

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - జ్ఞానులవలే నడుచుకొనుడి... దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫెసి 5:15,16 జీవం, మరణం మన స్వాధీనంలో లేనప్పటికీ, గతించిన కాలంలో మనిషికివున్న బలాన్ని బట్టి, యవ్వనాన్ని  బట్టి, తన ప్రాణానికి కొంత భరోసా వున్నట్లుగా అనిపించేది. అయితే, నేటి దినాల్లో పైకి ఎదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, ప్రాణ భయం వెంటాడుతూనే వుంది. ఒకవైపు తెగుళ్లు మనిషిని వెంటాడుతుంటే, మరొక వైపు మనిషే మానవత్వం విడచి, మానభంగాలు, మారణహోమం సృష్టిస్తున్నాడు. ఏదిఏమైనా మన కళ్ళముందున్న పరిస్థితులు, మనము వింటున్న వార్తలను బట్టి, రాబోయే రేపటిదినం కంటే, గడచిన నిన్నటి దినమే మంచిదనిపిస్తుంది. కారణం దినములు చెడ్డవి. అట్లా అని చెడ్డదినాలను దేవుడు నియమించలేదు గాని, మనిషి జీవించే జీవితమే చెడ్డ దినాలకు కారణమవుతుంది. దినాలు చెడ్డవి అవుతున్నాయంటే, దేవుని కృప దూరమవుతుందనేది స్పష్టం. అంటే, కృపాకాలం ముగించబడితే, దేవుని రాకడ  సమీపమనేది మరింత స్పష్టం.  💮  చెడ్డ దినములలో మనమేమి ...

- కాకులు నేర్పించే పాఠం..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - కాకులు నేర్పించే పాఠం.. కాకుల సంగతి విచారించి చూడుడి...-లూకా 12:24 ♻️ కాకులు ఐక్యతకలిగి వుంటాయి: కాకులకు చిన్న ఆహారం కనిపించినా చాలు, వాటి స్వార్ధం కోసం చూచుకోకుండా, కావ్ కావ్... అంటూ మిగిలిన కాకులన్నింటిని పిలుస్తాయి. ఒక కాకికి నష్టం వాటిల్లితే, మిగిలిన కాకులన్నీ వచ్చి చేరుతాయి. మనము ఒక కాకికి హానితలపెట్టినా గాని, కాకులన్నీ గుంపు గూడి మన వెంటబడి తరుముతాయి. కావ్ కావ్ మంటూ పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తాయి. దీనినిబట్టి మనకు అర్ధమవుతుంది అవెంత ఐక్యంగా వుంటాయో! కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నానని చెప్పుకొనే మనిషి ఎంతటి దయనీయమైన స్థితికి దిగజారిపోయాడంటే? ప్రాణాపాయస్థితిలోనున్న మనిషిని సెల్ ఫోన్ లో చిత్రీకరించి పేస్ బుక్ లో పోస్ట్ చెయ్యడానికి ఆరాటపడుతున్నాడుగాని, సాటిమనిషిని పట్టించుకొనే స్థితిలో లేడు. చిన్నప్పుడు మనమంతా పాఠ్య పుస్తకాలలో చదివినవాళ్ళమే. చలి చీమలన్నీ కలిస్తే సర్పాన్ని చంపేస్తాయి. గడ్డి పరకలన్నీ కలసి తాడుగా ఏర్పడితే, బలమైన ఏనుగును సహితం బంధించేస్తాయి. ఇట్లా కోకొల్లలు. పరిశుద్ధ గ్రంధములో కూడా ఐక్యతను గూర్చిన అనేకమైన అంశాలున్నాయి. నలుగురు కుష్...

మాంత్రికుల శక్తి v/s దేవుని శక్తి..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - మాంత్రికుల శక్తి v/s దేవుని శక్తి.. మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా  యెహోవా మోషే మాటచొప్పున చేసెను. (నిర్గమ 8:12,13) ఐగుప్తు దాస్యములో మ్రగ్గిపోతున్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి మోషే, అహరోనులు దేవుడు పంపించారు. అయితే, దేవుడు ముందుగానే తెలియజేసారు, ఫరో అంత తేలికగా నా ప్రజలను పంపించడని. దేవుని మాట చొప్పన ఫరో ఎదుట, మోషే, అహరోనులు అద్భుతాలు చెయ్యడం మొదలుపెట్టారు. కర్రను పాముగా మార్చారు. ఐగుప్తు మాంత్రికులు కూడా అట్లా చేయగలిగారు. చివరకు అహరోను కర్ర.  ఆ మాంత్రికులు కర్రలను మ్రింగివేసింది. రెండవసారి నీటిని రక్తంగా మార్చగా. ఆ మాంత్రికులు కూడా అట్లా చేయగలిగారు. మూడవసారి నదిలోని కప్పలను ఐగుప్తీయుల ఇండ్లలోకి రప్పింపగా. ఐగుప్తీయుల మాంత్రికులు కూడా అట్లా చేయగలిగారు. దేశమంతా కప్పలతో నిండిపోయాయి. చివరకు పిండి పిసికే తొట్లలోకూడా కప్పలు. అడుగుతీసి అడుగువేస్తే కప్పలే. మోషే, అహరోనులవలే మాంత్రికులు నదీలోనున్న కప్పలను భూమిమీదకు రప్పించగలిగారుగాని వాటిని చంపడానికి గాని, తిర...

- దేవునికి ఇచ్చుటలో నీ వైఖరి ఏమిటి ?

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - దేవునికి ఇచ్చుటలో  నీ వైఖరి ఏమిటి ? 👉 నేను కానుకలు సమర్పించకపోతే, సంఘము నడవదని, సేవకుడు పోషింపబడలేడని,  సంఘమంతా నాపైనే ఆధారపడివుందని నీవు అతిశయిస్తూ ఉన్నట్లయితే, నీయంతటి ఆధ్యాత్మిక దారిద్ర్యంలో కొనసాగుతున్న వ్యక్తి మరొకరు నీ సంఘములో లేరని గుర్తించు.  -నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘన పరచుము. - సామెతలు 3:9 ఈ సందేశం చదువుతున్న ప్రియ సహోదరీ,సహోదరులారా మీ కోసం కన్నీళ్ళతో ప్రార్థన చేసిన సేవకుని క్షేమం గురించి ఎప్పుడైనా ఆలోచించావా ? పరిస్థితులు బాగులేనప్పుడు కన్నీళ్ళతో పాస్టరయ్య...అంటూ సేవకుడు, సంఘం గుర్తుకొస్తుంది , పరిస్థితులు చక్కబడిన తర్వాత సేవకుడు గుర్తు రారు, సంఘము గుర్తు రాదు కదా..చాలా మంది విశ్వాసులు ఇలాగే వుంటున్నారు. సంఘం అవసరతలు గురించి ఆలోచించావా ? మీ దశమ భాగం పురుగులు కు వెస్తున్నావా ? లేక సంఘానికి సేవ కోసం ఇస్తున్నావా ? ఆలోచించు..సేవకుడు సంఘంలో గుర్తు చేశాడంటే, సేవా అవసరత కోసం సేవకుడు నిన్ను ప్రత్యేకంగా నిన్ను అడిగాడంటే ఆ అవసరత గుర్తించు, చేతనైతే నీ సహాయం చెయ్యి..దేవుడు చెప్పినట్లు వాక్యాని...

శత్రువులపై పగ...

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - శత్రువులపై పగ... అప్పుడు సమ్సోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసి కొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి (న్యాయాధి 16:28)  సంసోను: ▫️నాజీరు చేయబడినవాడు  ▫️అత్యంత బలశాలి  ▫️సింహమును చీల్చివేసిన వీరుడు.,  ▫️ఇనుప గుమ్మమును పెకలించి విసిరివేయగలిగిన వీరుడు.   ▫️౩౦౦ నక్కలను పట్టుకొని ఫిలిష్తీయుల పంటలను నాశనము చేసినవాడు.  ▫️పచ్చి గాడిద దవడ ఎముకచే వెయ్యి మందిని చంపిన ధీరుడు.  ▫️ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి  ▫️విశ్వాసవీరుడు (హెబ్రీ 11:32) సంసోను ప్రార్ధించిన రెండు సందర్భాలను మాత్రమే లేఖనాలలో వ్రాయబడినట్లు గ్రహించగలము.  1. పచ్చి గాడిద దవడ ఎముకచే వెయ్యి మందిని హతమార్చి, తాను దప్పికతో నున్నప్పుడు ప్రార్ధించిన సందర్భం.  2. దాగోను దేవతా గుడి స్థంభాలకు వ్రేలాడుతూ, శత్రువులమీద పగ తీర్చుకొనుటకు తాను చేసిన చివరి ప్రార్ధన  నేటి దినాన్న సంసోను ప్రార్ధించిన రెండవ సందర్భాన్ని ద్యానింతము.  ...

- పరిశుద్ధ గ్రంథ స్థానాన్ని, మొబైల్ తీసుకొంటుందా ?

Image
- పరిశుద్ధ గ్రంథ స్థానాన్ని, మొబైల్ తీసుకొంటుందా ? - నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. - కీర్తన 119:50 నీ యవ్వనంలో నీవు బైబిల్ మోస్తే? అది నీ వృద్ధాప్యమందు నిన్ను మోస్తుంది. కానీ, నేటిదినాలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బైబిల్ స్థానాన్ని చాలా వరకు మొబైల్ తీసుకుందనే చెప్పాలి. దేవుని మందిరాలకు సహితం, బైబిల్ లేకుండా మొబైల్ తోనే వెళ్లేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. అదేంటి అంటే? మొబైల్ లో పరిశుద్ధ గ్రంధం యాప్ వుంది కదా? అంటూ వాదించేవారు కోకొల్లలు. అవును వున్న మాట వాస్తవమే. పరిశుద్ధ గ్రంధముతో పాటు, అపరిశుద్ధమైన అశ్లీల చిత్రాలు కూడా వున్నాయి. నీవు వద్దనుకున్నా యాడ్స్ రూపంలో అవి దర్శనమిస్తూనే ఉంటాయి. మొబైల్ ని ఒక స్టేటస్ గా చూడొద్దు. బైబిల్ ను మోయడానికి సిగ్గుపడొద్దు. మొబైల్ నీచేతిలో ఉన్నంత మాత్రాన అది గర్వించదగిన విషయం కాదుగాని, పరిశుద్ధ గ్రంధం నీ చేతిలో వుంటే మాత్రం అది ముమ్మాటికీ గర్వించదగిన విషయమే. 🔅మొబైల్ లో బైబిల్ చదివితే ఏమవుతుంది?  🔹అది పరిశుద్ధ గ్రంధము అనే అనుభూతి గాని, భయము గాని కలుగదు. 🔹తద్వారా దేవుని సన్నిధిని,...