కయీను పశ్చాతాపం..
✝️ CHRIST TEMPLE-PRODDATUR - కయీను పశ్చాతాపం.. 🔸సృష్టిలో జన్మించిన మొట్టమొదటి మానవుడు 🔸వ్యవసాయకుడు 🔸మొట్ట మొదటి నరహంతకుడు 🔸సహోదరుని ప్రేమించలేని వాడు 🔸కోపం, ద్వేషం కలిగినవాడు 🔸సత్క్రియలు లేనివాడు 🔸దేవునికి అంగీకారయోగ్యమైన అర్పణ అర్పించలేనివాడు. 🔸దేవునిమీద ఎదురు తిరిగినవాడు 🔸రక్తం ప్రార్ధించడానికి కారకుడు 🔸నేల తన సారాన్ని కోల్పోవడానికి కారకుడు. 🔸దేవునిచే శపించబడినవాడు 🔸దేశ దిమ్మరి సృష్టిలో అత్యున్నతమైన సృష్టముగా దేవుడు మనిషిని సృష్టించారు. తలిదండ్రుల జన్మనివ్వడం ద్వారా భూమిమీదకు ఏతెంచనున్న మొట్టమొదటి మనిషిగా కయీనును దేవుడు నిర్ణయించారు. అంటే, కయీనుపట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళికవుందనే విషయం సుస్పష్టం. అయితే దేవుడు అతనిపట్ల కలిగియున్న ప్రణాళిక నెరవేరకుండా, తనకివ్వబడిన స్వేచ్ఛను కయీను వాడుకొని, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాడు. తాను అర్పించిన అర్పణ ద్వారా దేవునిని సంతోషపరచలేక పోవడమే కాకుండా, తన సహోదరుడైన హేబెలును చంపి, తన పాపమును ఒప్పుకొనక, కప్పుకొని, తనను సృష్టించిన దేవునిమీదే తిరు...