పరిశుద్ధ గ్రంధమును ప్రతి రోజు ఎందుకు ధ్యానించాలి..?
✝️ CHRIST TEMPLE-PRODDATUR - పరిశుద్ధ గ్రంధమును ప్రతి రోజు ఎందుకు ధ్యానించాలి..? ▫️పరిశుద్ధ గ్రంధమును ఎందుకు ధ్యానించాలంటే..? 🔅మన నడతను (ప్రవర్తన) సరిచేస్తుంది: "యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?" కీర్తనలు 119:9 హృదయం నిండిన దానినిబట్టే మన మాటలు, తలంపులు, క్రియలు ఆధారపడి వుంటాయి. అందుచే మొట్టమొదటగా మన హృదయం సరిచేయబడాలి. మన హృదయం సరిచేయబడాలి అంటే? పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించాలి. ఎందుకంటే? దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. (హెబ్రీ 4:12) 🔅దేవుని వాక్యము మనలను పాపము చెయ్యకుండా అడ్డగిస్తుంది " నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను." (కీర్తనలు 119:11) 🔅దేవుని వాక్యము మనకు సంతోషాన్నిచ్చి, ఆలోచన పుట్టిస్తాయి. "నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి." (కీర్తనలు 119:24) నీ మ...