Posts

కీర్తనలు పాడుడి..విజయం నీదే..

Image
  కీర్తనలు పాడుడి..విజయం నీదే.. కీర్తనలు పాడడం అనేది మన మనసును ఆహ్లాదపరిస్తూ మన మెదడును ప్రశాంతంగా మార్చుతుంది. మనం కీర్తనలు పాడినప్పుడు అది చింత, ఒత్తిడి నుండి ఉపశమనం కలుగజేస్తుంది. అదే కొంతమంది కలిసి పాటలు పాడినప్పుడు, వారి గుండె చప్పుళ్ళు ఒకరినోకరికి ఏకీభవిస్తాయని కొందరి పరిశోధకుల అభిప్రాయం. అపోస్థలుడు పౌలు అంటాడు “ఒకని నొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువు గూర్చి పాడుచు కీర్తించమని ప్రోత్సాహిస్తున్నాడు (ఎఫెసీ 5:19). పరిశుద్ద గ్రంథంలోని అనేక సందర్భాల్లో కూడా దేవుని స్తుతించమనే చెబుతుంది. “దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి.” కీర్తన 47:6. శత్రువులు యూదా జనాంగంవైపు వస్తున్నప్పుడు, భయపడిపోయిన రాజైన యెహోషాపాతు అందరినీ యెహోవా సన్నిధిని సమకూర్చాడు. సమాజాన్నంతటిని తీవ్రమైన ప్రార్ధనలో నడిపించాడు. వారు తినక త్రాగాక కేవలం ప్రార్ధన మాత్రమే చేశారు. “ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మా దిక్కు” అని ప్రార్ధన చేశారు. మరుసటి దినము యుద్ధరంగంలోనికి నడిచి శత్రువుల మీదికి వెళ్ళారు. అక్కడ వారిని నడిపించింది గాయక బృందమేగాని...

నూతన హృదయము నీకిచ్చెదను..

Image
 - నూతన హృదయము నీకిచ్చెదను.. గలిలయకు 150 కిలో మీటర్ల దూరంలో యెరూషలేముంటుంది. యేసు బోధ విని బాగుపడేందుకు కాదు, ఆయన బోధల్లో లోపాలెత్తి చూపించి, ఆయనకే ఎదురు బోధ చేసేందుకు వాళ్లంతా అంత ప్రయాసపడి రావడం ఆశ్చర్యకరం!! యేసును చూసి, ఆయన బోధ వినే భాగ్యాన్ని పొందిన ఎంతోమంది నిరక్షరాస్యులు, అజ్ఞానులు తమ జీవితాన్ని ధన్యం చేసుకొంటుండగా, మహా మేధావులుగా ముద్రపడినవారు ఆ భాగ్యాన్ని చేజార్చుకొని, యేసుతో వాతలు వేయించుకొని భ్రష్టులుగానే తిరుగుముఖం పట్టిన పరిసయ్యులనేమనాలి? కొందరంతే!! బోధ చేయడానికి, ఖండించడానికి, గద్దించడానికి ఇతరులకు బుద్ధి చెప్పడానికే తాము పుట్టామన్న దుర్భావనలో ఉంటారు . వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.2 తిమోతికి 4:2 కాని దానికి ముందుగా తమలోని అజ్ఞానపు అంధకారాన్ని గుర్తించి సరిచేసుకోలేని గురివింద గింజలు వాళ్లు. అలా పప్పులో కాలేసి చివరికి నరకంలో చేరే మాట అటుంచితే, లోపాలెత్తి చూపడం, విమర్శించడమే వ్యాపారంగా మారి విజ్ఞత లోపించిన తొందరపాటు నిర్ణయాలతో ఈ లోకంలోనే తమ జీవితాన్ని అశాంతితో నరకప్రాయం ...

24 గంటల్లో దుర్భరమైన కరవు సమృద్ధిగా మారింది..

Image
 24 గంటల్లో దుర్భరమైన కరవు సమృద్ధిగా మారింది.. సిరియా శత్రుసైన్యం షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసింది. ద్వారం మూసుకొని పట్టణం లోపల ఉన్న ఇశ్రాయేలీయులకు ఆహారం, నీరు తదితర అత్యవసర సరుకులు అందకుండా చేశారు. సిరియా సైనికులు పట్టణం లోపల కొంత కాలానికి ఆహారం నిండుకుంది. తర్వాత పక్షులు, గాడిదలూ చంపుకొని తిన్నారు. పిదప తల్లితండ్రులు తమ పిల్లల్నే చంపుకొని తినేంత దౌర్భాగ్యకరమైన దుర్భర క్షామం పట్టణంలో నెలకొంది. ఈ క్రీడంతా దేవుడే చేశాడు. ఇక ఆయన్ను నేనెందుకు ప్రార్ధించాలంటూ ఎదురు తిరిగారు షోమ్రోను రాజు (2 రాజులు 6:33). దేవుడు ఇంత భయంకరమైన క్షామాన్ని 24 గంటల్లో తొలగించి రేపు ఈ వేళకు సమృద్ధి ఆహారాన్నిస్తాడని ఎలీషా ప్రవక్త చెప్పాడు. పట్టణం లోపల కరవు రూపంలో, వెలుపల శత్రువుల రూపంలో మృత్యువు సంచారం చేస్తూంటే దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచి ఆహారమిస్తాడా? అని ఎకసెక్కాలాడాడు ఒక అధికారి. ప్రవక్త మాటల్ని ఎవరూ నమ్మలేనంత నిరాకారమైన క్షామం అది. అయితే ఎవరు నమ్మినా నమ్మకున్నా దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన తన కార్యాన్ని నెరవేర్చి తీరుతాడు. షోమ్రోనును చుట్టుముట్టిన సిరియా సైన్యంలో దేవుడు గందరగోళం సృష్టించాడు. ఇశ్రాయ...

అతని నమ్మిక అతనిని సిగ్గుపరచలేదు..

Image
- అతని నమ్మిక అతనిని సిగ్గుపరచలేదు.. అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా మరియు అబ్రాముఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.                    ఆది 15:2-4 అబ్రాహాముకు దర్శనమందు దేవుని వాక్యము ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతుంది. అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికం చేస్తాను. *వాక్యం మాట్లాడుతుందా?* అవును! వాక్యమే దేవుడై యుండెను.              యోహాను 1:1 దానికి అబ్రాహాము అంటున్నాడు. ప్రభువా నీవు నాకు ఎన్ని బహుమానాలు ఇచ్చినా ప్రయోజనం ఏంటి? నాకు సంతానం లేదుకదా? నా దాసుడే నాఇంటికి వారసుడు కదా? అని దేవునికి మనవి చేసినప్పుడు, ఆ దినాన్ని అతనికి దేవుడు గొప్ప వాగ్ధానమిచ్చాడు. నీ దాసుడు నీ ఇంటికి వారసుడు కాదు. నీ గర్భమున పుట్టబోవువాడే నీకు ...

100% ఫలించండి..

Image
- ఈ సంవత్సరం 100% ఫలించండి.. 1. ఫలించుట అనగా నేమి? 🍓🍓🍓🍓🍓🍓🍓🍓 పరిశుద్ధ గ్రంథము ఫలించుటను 'అభివృద్ధి పొందుట', 'వర్థిల్లుట' మరియు 'ఆశీర్వదించబడుట' అని కూడా తెలియజేస్తున్నది. *దేవుడు ఆదాము, హవ్వలను ఆశీర్వదించి - మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దానిని లోబరచుకొనుడని చెప్పెను. (ఆది 1:28)* ఇస్సాకు దేవుని ఆశీర్వాదాలను పొంది నూరంతల ఫలమును, మిక్కిలి గొప్పవాడగు వరకు అభివృద్ధిని పొందెను. (ఆది 26:12,13) *అబ్రాహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడెను.(ఆది 24:1)* 2. ఫలించుట ఎట్లు? 🍊🍊🍊🍊🍊🍊🍊🍊 *నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు; ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని ప్రభువు చెప్పెను. (యోహాను 15:1-5)* మనము మన పాపముల కొరకు పశ్చాత్తాపపడి, క్రీస్తును హృదయంలో చేర్చుకొని, ప్రార్థనలో ఆయనతో సహవాసము కలిగి, ఆయన చిత్తానుసారంగా బ్రతికినప్పుడు బహుగా ఫలిస్తాము! *దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టువలె ఫలించును. అతడు చేయున ద...

హ్యాపీ న్యూ ఇయర్

Image
- 2025 అనే తలుపు నీయెదుట తీయబడినది.. "ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను. దానిని ఎవడును వేయనేరడు. - ప్రకటన 3:8 2024లో సాతానుడు మన జీవితంలో అనేక విషయాలకు తలుపులు మూసి బంధించాడు. సాతాను చేత మూయబడిన అనేక ఇత్తడి తలుపులను ఇనుప గడియలను ప్రభువు ఈ సంవత్సరం పగులగొట్టి నూతన ద్వారములను నీకు తీయనున్నాడు. (యెషయా 45:2 నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగుల గొట్టెదను ఇనుప గడియలను విడగొట్టెదను)   కారణం..ప్రతి తలుపు యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నవి కనుక తలుపులు తీయుటకును వేయుటకును ఆయన సర్వాధికారి. ప్రభువు 2025లో నీ కొరకు తెరవనున్న కొన్ని తలుపులను మనం ఇప్పుడు గమనిద్దాం. *1. విశ్వాస తలుపు:*  ఈ సంవత్సరమైనా మనం విశ్వాసపు ద్వారంలో ప్రవేశించాలి. (అపో.కా 14:27 వారు వచ్చి, సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు, అన్యజనులు *విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు*, వివరించిరి.)  పౌలు మొదటి సువార్త దండయాత్రలో ప్రభువు అనేక పట్టణాల్లో ప్రభువు అనేకులను విశ్వాస తలుపులు తీసాడు. అంతి యోకయ, ఈకొనియా దెర్బే, మొదలగు ప...

నీకు అంతా మంచే జరుగుతుంది..

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*  నీకు అంతా మంచే జరుగుతుంది.. నేను దేవుణ్ణి ఎల్లప్పుడూ ఏ సందర్భాలోనైనా స్తుతిస్తాను అని ఒక స్నేహితునికి చెప్తూ ఉండేవాణ్ణి. అనుకోకుండా ఒకరోజు వేరే ఊరికి వెళుతున్నానని వీడ్కోలు చెప్పి బస్టాండ్ కు వెళ్ళాను. నేను ఆలస్యంగా వెళ్లేసరికి బస్సు ముందే వెళ్ళిపోయింది. ప్రయాణాన్ని వాయిదా వేసుకొని ఇంటికి తిరిగివచ్చిన నన్ను చూసి నా స్నేహితుడు నాకు సూటిగా ఒక ప్రశ్న వేశాడు. ఈ సందర్భాల్లో కూడా మీరు దేవుణ్ణి స్తుతిస్తారా అని నన్ను అడిగితే, నేను అవుననే చెప్పాను.  ఎలాగైతేనేం అన్ని పరిస్థితుల్లో అనగా నష్టంలో, కష్టంలో, అప్పుల్లో, బాధల్లో, అనారోగ్యం కూడా దేవునికి కృతఙ్ఞతలు చెల్లించాలన్న నా నమ్మకానికి ఒక క్రొత్త అర్ధం చేకూరింది. ఆరోజు బస్సు మిస్సయింది అనుకున్నాను కాని మరుసటి రోజు వార్తల్లో యాక్సిడెంటుకు గురైందని వార్తా పత్రికలో చదివినప్పుడు మేము ఆశ్చర్యపోయాము. ఈ సందర్భం మాలో గొప్ప అనుభూతిని కలుగజేసింది. మనం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో  “ప్రభువా నీకు వందనాలు” అని చెప్పడం కష్టమనిపిస్తుంది. దేవుని ఉద్దేశాలు మనం చూడగలిగినా, లేకపోయినా ప్రతి పరిస్థితిలో ద...